భూమి పూజకు ముహూర్తం ఖరారయిన నేపథ్యంలో తెలంగాణ భవన్ నిర్మాణ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. భూమిపూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పదవుల్లో వున్నవారు, పార్టీ పదవుల్లో వున్నావారు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.