నాలుగు విడతల్లో బండి పాదయాత్ర: ఈ నెల 9 నుండి ప్రారంభం

First Published Jul 4, 2021, 3:07 PM IST

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అన్ని రకాల అస్త్రాలను సిద్దం చేసుకొంటుంది. ఇందులో భాగంగానే పాదయాత్ర చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ నెల 9వ తేదీ నుండి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టనున్నారు.ఈ నెల 9వ తేదీన ఉదయం హైద్రాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించనున్నారు. హుజూరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చెప్పారు.
undefined
నాలుగు విడతలుగా పాదయాత్ర చేయాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకొన్నారు. అక్టొబర్ రెండవ తేదీ వరకు తొలి విడత పాదయాత్ర నిర్వహించనున్నారు. తొలి విడతలో 55 రోజుల పాటు 750 కి.మీ పాదయాత్ర నిర్వహిస్తారు.
undefined
ప్రతి రోజూ 15 నుండి 20 కి.మీ దూరం పాటు సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని బీజేపీ చీఫ్ ఈ పాదయాత్రను ప్లాన్ చేశారు
undefined
మరో వైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్దం చేయడం కోసం మరో మూడు విడతల పాటు యా్ర నిర్వహించనున్నారు బండి సంజయ్.
undefined
హుజూరాబాద్ ఉప ఎణ్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఇప్పటికే ఇంచార్జీలను ఆ పార్టీ నియమించింది. టీపీసీసీ కొత్త బాస్ గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం నియమించింది.
undefined
రేవంత్ రెడ్డి కూడ ఈ నెలలోనే పాదయాత్ర చేయాలని ప్లాన్ చేసుకొంటున్నారు.ఈ నెల రెండో వారంలో రేవంత్ రెడ్డి తన పాదయాత్ర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
undefined
రేవంత్ రెడ్డి పాదయాత్ర కంటే ముందుగాను బండి సంజయ్ తన యాత్ర విషయాన్ని ప్రకటించారు. రేవంత్ రెడ్డి యాత్ర ఏకబిగిన సాగుతుందా ఎలా ఉంటుందనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
undefined
click me!