ఇయర్ ఫోన్స్ లేకుండా ఈ స్మార్ట్ గ్లాసేస్‌ తో మ్యూజిక్ వినొచ్చు, కాల్స్ చేయవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

First Published Apr 29, 2021, 3:03 PM IST

 ఇంగ్లాండ్ సంస్థ జెర్ట్జ్  ఒక కొత్త స్మార్ట్ గ్లాసేస్‌ని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. జెర్ట్జ్  మొట్టమొదటిసారి ట్రూ వైర్‌లెస్ స్టీరియో టెక్నాలజీ ఆధారిత ఆడియో-ఫ్రేమ్‌లు, ఆడియో సన్ గ్లాసెస్‌ను భారతీయ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది.

జెర్ట్జ్ కార్బన్ ఎక్స్‌జెడ్01, ఎలైట్ ఎక్స్‌జెడ్01 పేరుతో వస్తున్న వీటిని తాజాగా అందుబాటులోకి తెచ్చింది. వీటిలో కార్బన్ ఎక్స్‌జెడ్01 ఆడియో ఫ్రేమ్ రీడింగ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎక్స్‌జెడ్01 సిరీస్ ఆడియో గ్లాసెస్ స్ప్లాష్ అండ్ డర్ట్ ప్రూఫ్ కూడా. ఇవి డి‌ఐ‌ఏ‌ఎం కోటింగ్, ఈ‌ఎక్స్‌టి లేయర్‌తో వస్తాయి. అంటే వాటర్, ఆయిల్ వల్ల అవి ప్రభావితం కావు.
undefined
ఈ గ్లాసెస్ కి యాంటీ గ్లేర్ సన్ లెన్స్‌ ఉంటాయి, ఇవి ఎలాంటి సందర్భంలోనైన ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కళ్ళను సురక్షితంగా ఉంచుతాయి. ఈ గ్లాసెస్ రెండు వైపులా 110mAh బ్యాటరీతో వస్తాయి, ఇది వినియోగదారులు 5 గంటల వరకు మ్యూజిక్ ప్లే అందిస్తుంది. దీనిని ఫుల్ ఛార్జి చేయడానికి 2 గంటల సమయం పడుతుంది.
undefined
ఈ గ్లాసెస్ మాగ్నెటిక్ ఛార్జ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ అండ్ వాయిస్ కాల్స్ కోసం డైరెక్షనల్ ఆడియో స్పీకర్లతో వస్తాయి. కేవలం ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా మీరు మ్యూజిక్ ప్లే చేసి ఆస్వాదించవచ్చు అలాగే ఎటువంటి అసౌకర్యం లేకుండా కాల్స్ చేయవచ్చు. ఈ ఉత్పత్తుల ధరలు రూ.9,999 నుండి ప్రారంభమవుతాయి. వీటిని అమెజాన్ ఇండియా, www.xertz.in ద్వారా కొనుగోలు చేయవచ్చు.
undefined
ఈ గ్లాసెస్ లాంచ్ సందర్భంగా సమీర్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు డీప్ వ్యాస్ మాట్లాడుతూ, 'మా స్టయిల్, సౌకర్యం, క్లారీటి విలువలకు మేము కట్టుబడి ఉన్నాము, ఈ ప్రమాణాలను జెర్ట్జ్ వలె మా టెక్నాలజీ ఆవిష్కరణ ద్వారా పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కొత్త తరం భారతీయులు వారి అభిరుచులకు అనుగుణంగా స్టయిలిష్ ఇంకా వినూత్న గాడ్జెట్‌లను వెతుకుతున్నారని మాకు తెలుసు. మా ప్రతి విభాగం వినియోగదారులకు సౌకర్యవంతమైన, మన్నికైన ఉత్పత్తులను అందిస్తుంది.
undefined
undefined
click me!