ఇండియాలోనే అతి చౌకైన ఒప్పో 5జి స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. పెద్ద ర్యామ్, భారీ స్టోరేజ్ తో నేడే లాంచ్..

First Published Apr 27, 2021, 4:46 PM IST

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఒప్పో  చౌకైన 5జి స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో ఏ53ఎస్ ను మంగళవారం భారతదేశంలో విడుదల చేసింది. దీనికి ముందు కంపెనీ ఏ74 5జిని భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఒప్పో ఏ53ఎస్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం భారత మార్కెట్లో ఇది చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా మారింది. దీనికి 13ఎం‌పి ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందించారు. ఒప్పో ఏ53ఎస్ 5జిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ లభిస్తుంది ఇది 5 జి ప్రాసెసర్.
undefined
ఒప్పో ఏ53ఎస్ ధర6జి‌బి + 128జి‌బి వేరియంట్ ధర భారతదేశంలో రూ.14,990, 8జి‌బి + 128జి‌బి వేరియంట్ ధర రూ.16,990. మే 2న మధ్యాహ్నం 12 గంటలకు నుండి ఫ్లిప్‌కార్ట్ నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు. క్రిస్టల్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే దీని ధర కారణం ఈ ఫోన్ ఇప్పుడు భారతదేశంలో చౌకైన 5జి‌ స్మార్ట్‌ఫోన్‌గా మారింది. ఇంతకుముందు రియల్‌మీ 8 5జిని రూ.14,999 విడుదల చేసింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ గురించి మాట్లాడితే ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై రూ .1,250 వరకు 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది.
undefined
ఒప్పో ఏ53ఎస్ 5జి స్పెసిఫికేషన్లుఈ కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్‌ఓఎస్ 11.1 లో పనిచేస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.52-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ లభిస్తుంది.
undefined
మెమొరీ కార్డు సహాయంతో మెమరీని 1టి‌బి వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ విషయానికొస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 13 ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి మాక్రో కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా లభిస్తుంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా అందించారు.
undefined
ఒప్పో ఏ53ఎస్ బ్యాటరీదీనికి 5,000mAh, 10W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్-మోడ్ 5జి, 4 జి, వైఫై, బ్లూటూత్, జిపిఎస్‌ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
undefined
click me!