ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వర్ డౌన్.. 6 గంటల పాటు నిలిచిపోయిన సేవలు..

Ashok Kumar   | Asianet News
Published : Oct 05, 2021, 01:13 PM IST

సోమవారం రాత్రి ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, వాట్సప్ , ఇన్స్తగ్రామ్ సర్వర్లు అకస్మాత్తుగా డౌన్ అయ్యాయి. నిన్న రాత్రి 9.15 గంటల సమయంలో ఈ మూడింటి సర్వర్లు డౌన్ అయ్యాయి దీంతో  వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది,.

PREV
15
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వర్ డౌన్.. 6 గంటల పాటు నిలిచిపోయిన సేవలు..

సుమారు ఆరు గంటల పాటు ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించలేకపోయారు. అయితే ఉదయం 4.30 గంటలకు ఫేస్‌బుక్ ఒక ట్వీట్ ద్వారా సేవలను పునరుద్ధరించినట్లు తెలియజేసింది. దీనితో పాటు వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ క్షమాపణలు కూడా చెప్పింది. ఈ అంతరాయం సమస్య తలెత్తినప్పుడు ప్రజలు మెసేజెస్ పంపలేక పోవడం బ్రౌస్ చేయలేకపోవడంలో  ఎబ్బందులు ఎదురుకొన్నారు.

25

సేవలు పునరుద్ధరించిన తర్వాత వాట్సప్  అధికారిక హ్యాండిల్ నుండి ట్వీట్ ద్వారా దీని గురించి తెలియజేసింది. సేవలు క్రమంగా పునరుద్ధరించబడుతోందని మేము అత్యంత జాగ్రత్తగా వహిస్తున్నామని  వాట్సాప్ ట్వీట్‌లో పేర్కొంది. కొంత సమయం పాటు వాట్సాప్ ఉపయోగించలేకపోయిన లేదా సమస్యలు ఎదురుకొన్న వారందరికీ క్షమాపణలు కోరుతున్నం. మీ అందరి సహనానికి ధన్యవాదాలు  అని తెలిపింది.

35

గతంలో కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. వాట్సాప్ పనిచేయకపోవడంపై కొంతమంది నుండి మాకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. మేము దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము, వీలైనంత త్వరగా అప్‌డేట్ చేస్తాము.  వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది - కొంతమంది మా యాప్స్, సర్వీసెస్ లో సమస్యలను ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. మేము వీలైనంత త్వరగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము అని వెల్లడించింది.

45

వాట్సాప్, ఇన్స్తగ్రామ్  వెబ్ ఇంకా  స్మార్ట్ ఫోన్స్ రెండింటిలో పనిచేయ లేదు. ఈ సమస్య అన్ని అండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వెబ్ ప్లాట్‌ఫారమ్‌లలో సంభవించింది. ప్రజలు కొత్త మెసేజెస్ పొందడం  లేదా  పంపడంలో సమస్యలు ఎదురుకొన్నారు. అదేవిధంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్ రిఫ్రెష్‌లో 'కాంట్ రిఫ్రెష్' అనే మెసేజ్ కనిపించింది.

DownDetectorలో ప్రజలు వాట్సాప్ పనిచేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. అలాగే ఇన్స్తగ్రామ్, ఫేస్ బుక్ గురించి కూడా ఫిర్యాదు చేసారు. ఇంకా మెసేజ్ పంపకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Downdetector.com ప్రకారం ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్  వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు, సర్వర్ డౌన్ కావడంతో సుమారు 50వేల మంది ఫిర్యాదులు చేశారు అని పేర్కొంది.
 

55

ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఎదుర్కొంటున్న సమస్య గురించి ట్విట్టర్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు డౌన్ అవుతున్నాయని 8.5 లక్షల ట్వీట్లు  చేశారు. తారువాత వాట్సాప్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఐటి బృందం సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తోందని తెలిపింది. అయితే, ఫేస్‌బుక్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.  ఈ సమయంలో ప్రజలు ట్విట్టర్‌లో చాలా ట్వీట్లు చేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల సర్వర్ డౌన్ గురించి వినియోగదారులు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయగా  దీని గురించి చాలా మంది ఫన్నీ మీమ్స్ కూడా షేర్ చేశారు. 
 

click me!

Recommended Stories