రిలయన్స్ జీయో సరికొత్త ఫీచర్.. ఇప్పుడు డబ్బు చెల్లించకుండనే స్మార్ట్ రిచార్జ్..

First Published Jul 3, 2021, 1:28 PM IST

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో  కస్టమర్ల కోసం ఎమర్జెన్సీ డేటా లోన్ సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేరు సూచించినట్లుగానే  ఇది నిజంగానే ఎమర్జెన్సీ సదుపాయం. డేటా అయిపోయిన లేదా కొన్ని కారణాల వల్ల వెంటనే రీఛార్జ్ చేయలేని వినియోగదారుల కోసం ఈ  ఎమర్జెన్సీ డేటా లోన్ సౌకర్యం  ప్రవేశపెట్టింది.
 

జియో కస్టమర్లకు 'రీఛార్జ్ నవ్ పే లేటర్' సదుపాయం వారి వాలెట్ లేదా అక్కౌంట్ లో డబ్బు లేనప్పుడు సహాయపడుతుంది.
undefined
రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులు ఇప్పుడు 1 జిబి చొప్పున 5 ఎమర్జెన్సీ డేటా లోన్ ప్యాక్‌ల వరకు లోన్ తీసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రతి 1 జిబి డేటా లోన్ జియో వినియోగదారుల నుండి డేటా లోన్ తీసుకున్నందుకు రూ.11 చార్జ్ చేస్తుంది. కొన్ని కారణాల వల్ల వెంటనే రీఛార్జ్ చేసుకోలేని కస్టమర్లు జియో యాప్ నుండి ఎప్పుడైనా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
undefined
మైజియో యాప్‌లో రిలయన్స్ జియో ఎమర్జెన్సీ డేటా లోన్ సదుపాయాన్ని ఎలా పొందాలంటే ?స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లోని మైజియో యాప్ లోకి వెళ్లి మెనూ ఆప్షన్ క్లిక్ చేయండి. మేను ఆప్షన్ జియో యాప్ ఎడమవైపు పై భాగంలో ఉంటుంది.స్టెప్ 2: మొబైల్ సర్వీస్ కింద 8వ స్థానంలో మీకు 'ఎమర్జెన్సీ డేటా లోన్' ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి.స్టెప్ 3: మీకు 'రిచార్జ్ నవ్ పే లాటర్' అనే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి.స్టెప్ 4: తరువాతి పేజీలో 'గెట్ ఎమర్జెన్సీ డేటా' ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండీ.స్టెప్ 5: తరువాత 'ఆక్టివెట్ నవ్' పై నొక్కండి. దీంతో మీ ఎమర్జెన్సీ డాటా లోన్ ఆక్టివేట్ అవుతుంది.
undefined
click me!