అత్యంత సున్నితమైన డిస్ ప్లే తో రెడ్‌మి నోట్ 10 సిరీస్.. త్వరలో ఇండియాలో లాంచ్..

First Published Feb 11, 2021, 1:44 PM IST

చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమికి చెందిన రెడ్‌మి నోట్ 10 వచ్చే నెలలో భారత్‌లో లాంచ్ కానుంది, అయితే లాంచ్ డేట్ గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఫోన్ లాంచ్ పై మాత్రం సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఈ కొత్త సిరీస్ రెడ్‌మి నోట్ 9 లైనప్‌లో  ప్రారంభించనుంది. రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో రెడ్‌మి నోట్ 10 సిరీస్ కింద లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 

ఈ రెండు ఫోన్‌లతో పాటు కంపెనీ రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 10 ఎస్ లను కూడా ప్రవేశపెడుతుందని, ఒకవేళ నిజంగా ఇదే జరిగితే రెడ్‌మి నోట్ సిరీస్ కింద ఒకేసారి నాలుగు ఫోన్‌లను లాంచ్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది అని తెలిపారు.
undefined
రెడ్‌మి నోట్ 10 లాంచ్ గురించి షియోమి మైక్రో సైట్ కూడా రూపొందించింది. రెడ్‌మి నోట్ 10 సిరీస్ సేల్ అమెజాన్ ఇండియా నుంచి రాబోతున్నట్లు కూడా ధృవీకరించబడింది. రెడ్‌మి నోట్ 10 సిరీస్ కోసం అమెజాన్ ఇండియాలో ప్రొడక్ట్ పేజీ కూడా ప్రత్యక్షంగా ఉంటుంది.
undefined
షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మన్మో కుమార్ జైన్ కూడా ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. రెడ్‌మి నోట్ 10 సిరీస్ సున్నితమైన డిస్ ప్లే ఫోన్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రెడ్‌మి నోట్ 10 సిరీస్‌లో ఇది అధిక రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో ఫోన్ లాంచ్ అవుతుందని తెలిపారు.
undefined
షియోమి ఇటీవల రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లైన రెడ్‌మి నోట్ 9 టి, రెడ్‌మి 9టిలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 9టి, రెడ్‌మి నోట్ 9 5జి అప్‌గ్రేడ్ వెర్షన్, అయితే రెడ్‌మి 9టి గత ఏడాది చైనాలో లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 9 4జికి రీ-బ్రాండెడ్ వెర్షన్.
undefined
రెడ్‌మి నోట్ 9 4జిని గత నెలలో భారతదేశంలో రెడ్‌మి 9 పవర్ పేరుతో లాంచ్ చేశారు. రెడ్‌మి ఈ రెండు ఫోన్‌లు గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్‌లో మల్టీ షేడ్‌లతో ఉంటుంది. రెడ్‌మి నోట్ 9 టిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, రెడ్‌మి 9 టిలో నాలుగు కెమెరాలతో లాంచ్ చేశారు. ఈ రెండు ఫోన్లు భారతదేశంలో లాంచ్ పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
undefined
undefined
click me!