ప్రకటన ప్రకారం, ఈ ప్రయోగం వాణిజ్యపరంగా విజయవంతమైతే, పోస్టల్ పార్శిల్ సర్వీస్ వేగంగా పని చేస్తుంది. ఇండియా డ్రోన్ ఫెస్టివల్ 2022ని జరుపుకుంటున్న సమయంలో పోస్టల్ శాఖ గుజరాత్లోని కచ్లో డ్రోన్ డెలివరీని విజయవంతంగా ప్రయోగాత్మకంగా నిర్వహించిందని దేవుసిన్ చౌహాన్ ట్వీట్ చేశారు. డ్రోన్ 30 నిమిషాల్లో 46 కిలోమీటర్ల వైమానిక దూరాన్ని విజయవంతంగా కవర్ చేసింది.
దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ "భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022"ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ వ్యవసాయం, క్రీడలు, రక్షణ అండ్ విపత్తు నిర్వహణ వంటి రంగాలలో డ్రోన్ల వినియోగం పెరుగుతుందని అన్నారు.