జియో లేటెస్ట్ ఆఫర్.. రెండేళ్ల పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ పూర్తిగా ఉచితం

First Published Feb 27, 2021, 12:19 PM IST

రిలయన్స్ జియో  కొత్త ఆఫర్ కోసం  ఎదురుచూస్తున్నారా... అయితే రిలయన్స్ కస్టమర్ల కోసం ఒక  అద్భుతమైన బహుమతిని తీసుకొచ్చింది. జియో  2జి ఫ్రీ ఇండియా '2జి-ముక్ట్ భరత్' ప్రచారంలో భాగమైన ఒక ఆఫర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో సుమారు 30 కోట్ల 2జి యూజర్లు ఉన్నారు, వీరి కోసం జియో  కొత్త ఆఫర్‌ను అందిస్తుంది.
 

జియో కొత్త ఆఫర్ ఏంటంటే ఇప్పటికీ 2జి ఉపయోగిస్తున్నవారు 4జిలోకి రావాలనుకునే వారి కోసం. జియో ఈ కొత్త ఆఫర్ 1 మార్చి 2021 నుండి అందుబాటులోకి వస్తుంది. ఈ ఆఫర్ రిలయన్స్ రిటైల్ స్టోర్ లేదా జియో రిటైల్ స్టోర్ నుండి పొందవచ్చు. ఈ ఆఫర్ లో భాగంగా రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, వాటిలో ఒకటి రూ .1,999, మరొకటి రూ .1,499.
undefined
మొదటి ఆఫర్‌ రూ .1,999 ప్లాన్ మీకు 24 నెలల పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో ప్రతి నెలా 2 జిబి హై స్పీడ్ డేటా లభిస్తుంది.
undefined
రెండవ ప్లాన్ రూ .1,499. ఈ ప్లాన్ కింద మీరు ప్రతి నెల 12 నెలలు పాటు ప్రతి నెల 2 జిబి డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. మీరు పాత కస్టమర్ అయితే మీరు కేవలం 749 రూపాయల రీఛార్జితో ఒక సంవత్సరం మొత్తం ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఆనందించవచ్చు. ప్రతి నెల మీకు 2 జీబీ డేటా కూడా వస్తుంది.
undefined
సాధారణంగా మీరు ఫీచర్ ఫోన్ కొనడానికి 1,200-1,500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ మీకు 4జి లభించదు, కాబట్టి ఈ జియో ఆఫర్ కొత్త ఫోన్ కోసం చూస్తున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 4జి నెట్‌వర్క్ తో పాటు వాట్సాప్, గూగుల్ అసిస్టెంట్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
undefined
click me!