ఐఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఇండియాలోనే ఐప్యాడ్లను ఉత్పత్తి చేయనున్న ఆపిల్..

First Published Feb 18, 2021, 6:18 PM IST

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ప్రస్తుతం భారతదేశంలో ఐఫోన్  కొన్ని మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది, కానీ ఇప్పుడు కంపెనీ భారతదేశంలో ఐప్యాడ్లను కూడా ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. ఇందుకు భారతదేశంలో ఐప్యాడ్ల ఉత్పత్తి కోసం భారత ప్రభుత్వ ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ) లో పాల్గొంటుంది.

గత సంవత్సరం భారత ప్రభుత్వం దేశంలో స్మార్ట్ ఫోన్లు, వీడి భాగాల ఉత్పత్తి కోసం పిఎల్ఐ పథకాన్ని 665 మిలియన్ డాలర్లు అంటే సుమారు 49,210 కోట్ల రూపాయలతో ప్రారంభించింది. స్థానికంగా తయారు చేసిన ఏదైనా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పెంచడం, దాని ఎగుమతులను పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం ద్వారా కొత్త ఉద్యోగా అవకాశాలను మరింత అందిస్తుంది.
undefined
ఒక నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పిఎల్‌ఐ పథకాన్ని ప్రారంభించనుంది. ఇందులో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, సర్వర్‌లు వంటి ఐటి ఉత్పత్తులను తయారుచేసే సంస్థలు పాల్గొంటాయి. వచ్చే ఐదేళ్లలో ఖర్చు చేయనున్న ఈ కొత్త పథకానికి 7,000 కోట్ల బడ్జెట్ ఉంది. కొత్త ఐటి పిఎల్‌ఐ పథకాన్ని ఫిబ్రవరి చివరి నాటికి ప్రకటించవచ్చు.
undefined
20వేల కోట్ల పెట్టుబడులతో ఈ పథకంలో ఆపిల్ అతిపెద్ద పెట్టుబడిదారి అని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐఫోన్ ఉత్పత్తి అవుతున్న విస్ట్రాన్‌లో ఆపిల్ ఐప్యాడ్ తయారవుతుందని భావిస్తున్నారు.
undefined
మేడ్ ఇన్ ఇండియా ఐప్యాడ్ కల నెరవేరుతుందిఆపిల్ ప్రస్తుతం చైనాలో సంస్థ ఐప్యాడ్లు ఆన్నింటినీ అసెంబుల్ చేస్తుంది, కాని కరోనా తరువాత చైనా చిత్రం ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఆపిల్ ఉత్పత్తిని భారతదేశం, వియత్నాం వంటి దేశాలకు మార్చాలని యోచిస్తోంది. ఫాక్స్ కాన్ వియత్నాంలో ఐప్యాడ్, మ్యాక్ బుక్ లు, ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేస్తోంది. చైనాలోని బి‌వై‌డిలో ఎలక్ట్రానిక్ ఆపిల్ ఐప్యాడ్, మాక్‌బుక్‌లను ఉత్పత్తి చేస్తుంది.
undefined
click me!