కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఈ సేల్ ఒక మంచి ఛాన్స్. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ.94,999 నుంచి రూ.89,999కి తగ్గింది. రూ.1,19,999 విలువైన వివో X300 FE 5G ఇప్పుడు రూ.89,999కే అందుబాటులో ఉంది. 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ ఎయిర్ మోడల్పైనా భారీ డిస్కౌంట్ ఉంది. రూ.1,19,900 ధర ఉన్న ఈ ఫోన్ను ప్రస్తుతం రూ.97,900కు అమ్ముతున్నారు.
ఫోల్డబుల్ ఫోన్పైనా ఆఫర్
శాంసంగ్ ప్రీమియం ఫోల్డబుల్ మోడల్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా 5G ధరను కూడా ఈ సేల్లో తగ్గించారు. రూ.2,24,999 విలువైన ఈ ఫోన్ ఇప్పుడు రూ.1,99,999కే లభిస్తోంది. అలాగే, రూ.1,66,899 అసలు ధర ఉన్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256 జీబీ మోడల్ ఆఫర్ ధర ఇప్పుడు రూ.1,56,399.