సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా జూలై 2023లో 'థ్రెడ్స్' అనే యాప్ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను సొంతం చేసుకున్న మెటా.. ట్విట్టర్కు పోటీగా 'థ్రెడ్స్' యాప్ను విడుదల చేసింది.
విడుదలైన ఐదు రోజుల్లోనే 'థ్రెడ్స్' యాప్ 10 కోట్ల మంది యూజర్లను చేరి రికార్డు సృష్టించింది. అయితే, ఆగస్టు నాటికి, డైలీ యూజర్స్ సంఖ్య 80% తగ్గింది. ‘థ్రెడ్స్’ యాప్ను వినియోగించే సమయం కూడా తగ్గినట్లు సమాచారం. జూలైలో వినియోగదారులు సగటున రోజులు 21 నిమిషాలు థ్రెడ్స్ యాప్ లో గడిపారు, అయితే నవంబర్లో కేవలం మూడు నిమిషాలకు పడిపోయింది.