కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో మాట్లాడుతూ, "స్టార్లింక్కి లైసెన్స్ మంజూరైంది. తరువాతి దశలో స్పెక్ట్రమ్ కేటాయింపు ఉంటుంది. అప్పుడే శాటిలైట్ టెలికాం సేవలు దేశవ్యాప్తంగా వేగంగా అందుబాటులోకి వస్తాయి" అని తెలిపారు.
గతంలో దేశంలో ఫిక్స్డ్ లైన్ (Fixed Line) టెలిఫోన్లు మాత్రమే ఉండేవి. తరువాత మొబైల్, బ్రాడ్బ్యాండ్, ఆప్టికల్ ఫైబర్ వంటి ఆధునిక టెక్నాలజీలు వచ్చాయి. ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ కూడా చేరడం చాలా కీలకం కానుందని మంత్రి తెలిపారు.
కేబుల్స్ వేయడం ఇబ్బందిగా ఉండే కొండప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు వంటి చోట్ల కూడా శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా కనెక్టివిటీ ఇవ్వవచ్చు అని మంత్రి చెప్పుకొచ్చారు.