వినేష్ ఫోగట్
వినేశ్ ఫోగట్ తన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది. "దేశం కోసం పతకాలు సాధించినప్పుడు దేశం మొత్తం మమ్మల్ని గర్వంగా అభివర్ణించింది. ఇప్పుడు న్యాయం కోసం గళమెత్తితే మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. ప్రధాని గారూ, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మేము దేశద్రోహులమా?" ఎక్స్ లో పోస్ట్ చేసిన బహిరంగ లేఖలో ఫొగట్ ప్రధాని నరేంద్ర మోడీకి అడిగారు.