ఈషా సింగ్ :
పారిస్ ఒలింపిక్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులలో హైదరాబాద్కు చెందిన ఈషా సింగ్ ఒకరు. ఈ తెలంగాణ స్టార్ షూటర్ కు ఇది తొలి ఒలింపిక్ ప్రయాణం. ఇప్పటికే ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్లలో అద్భుతమైన ప్రదర్శనతో ఒలింపిక్స్ లో అడుగుపెట్టింది. చివరిసారిగా భారత్ 2012 లండన్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో పతకాలు గెలుచుకుంది. ఆ తర్వాత నిరాశే మిగిలింది. అయితే, ఈ సారి స్టార్ షూటర్ మను భకర్ తో పాటు ఇషా సింగ్పై భారీ అంచనాలు ఉన్నాయి. 2014లో షూటింగ్ కెరీర్ లోకి వచ్చిన ఇషా.. అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్ షూటర్లకు షాకిచ్చి గోల్డ్ గెలుచుకుంది. పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ గెలుస్తాననే ధీమాతో ఉంది ఈషా సింగ్.