ఆ ఒక్క ఇన్నింగ్స్‌లోనే స్కైలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్స్ కనిపించారు.. వారెవరంటే.?

Published : Feb 10, 2026, 07:58 PM IST

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్‌లో అమెరికాపై సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 84 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. అతని ప్రశాంతత, మ్యాచ్ ముగించే తీరు ఎంఎస్ ధోనిని గుర్తుచేస్తున్నాయని అమెరికా స్పిన్నర్ హర్మీత్ సింగ్ ప్రశంసించాడు.

PREV
15
టీ20 ప్రపంచకప్‌లో..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియాను గట్టెక్కించిన సంగతి తెలిసిందే. భారత అగ్రశ్రేణి బ్యాటర్లు విఫలమైన క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

25
కేవలం 49 బంతుల్లో..

తన సహజ సిద్ధమైన షాట్లను పక్కన పెట్టి, జట్టు అవసరాలకు తగ్గట్టుగా సంయమనంతో ఆడి, కేవలం 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ పై అమెరికా స్పిన్నర్ హర్మీత్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు.

35
ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలతో

సూర్యకుమార్ ను ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలతో పోల్చడం విశేషం. ఒత్తిడి సమయాల్లో సూర్య ప్రదర్శించిన ప్రశాంతత, మ్యాచ్ ను ముగించే తీరు ధోని స్థితప్రజ్ఞతను గుర్తుచేసిందని హర్మీత్ వ్యాఖ్యానించాడు.

45
పక్కా ఫినిషర్ గా..

అలాగే, ఈ మ్యాచ్ లో అతను ఒక పక్కా ఫినిషర్ గా మారి పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు విరాట్ కోహ్లీని తలపించిందని పేర్కొన్నారు. కెప్టెన్సీ బాధ్యతలతో సూర్య ఆట తీరులో సానుకూల మార్పు వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

55
నమీబియాతో ఢిల్లీలో రెండో మ్యాచ్

టీ20 ప్రపంచకప్ మొదటి మ్యాచ్ లో యూఎస్ఏను ఓడించి.. తన తొలి విజయాన్ని అందుకున్న టీమిండియా.. గురువారం నమీబియాతో ఢిల్లీలో రెండో మ్యాచ్ లో తడబడనుంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడకపోవచ్చునని టాక్. 

Read more Photos on
click me!

Recommended Stories