Sanju Samson to CSK : 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఐపీఎల్లో ట్రేడ్ చర్చలు వేడెక్కుతున్నాయి. సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కి ఇవ్వడానికి రాజస్థాన్ రాయల్స్ సిద్ధమయ్యారని సమాచారం. కానీ, దానికి బదులుగా జడేజా, బ్రెవిస్ను కోరుతున్నారు.
సంజూ శాంసన్ ట్రేడ్ చర్చలు.. ఐపీఎల్ చరిత్రలో సునామీ?
ఐపీఎల్ చరిత్రలో అత్యంత పెద్ద ట్రేడ్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉన్న ఒప్పందం ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ (RR) తమ కెప్టెన్, స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు (CSK) పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఈ ట్రేడ్కు రాయల్స్ పెట్టిన షరతులు షాకిస్తున్నాయి. సంజూకు బదులుగా రవీంద్ర జడేజా, డేవాల్డ్ బ్రెవిస్ ఇద్దరినీ కావాలని డిమాండ్ చేస్తున్నారని క్రిక్ బజ్ రిపోర్ట్ పేర్కొంది.
సంజూ శాంసన్ రాజస్థాన్ జట్టులో చాలా కాలంగా కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2025 మెగా వేలానికి ముందు ₹18 కోట్లకు ఆయనను రిటైన్ చేశారు. అదే మొత్తానికి చెన్నై జడేజాను కూడా నిలుపుకుంది. జడేజా 2012 నుంచి చెన్నై జట్టుతో ఉన్నారు. ఆసక్తికరంగా, ఆయన 2008లో తన ఐపీఎల్ కెరీర్ను రాజస్థాన్ రాయల్స్తోనే ప్రారంభించారు.
26
జడేజా, సంజూ శాంసన్ రూ.18 కోట్ల ఆటగాళ్లు
ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు రెండు జట్లూ ట్రేడ్ చర్చలు ప్రారంభించాయని ఈ నివేదిక తెలిపింది. "సంజూ శాంసన్, రవీంద్ర జడేజా ఇద్దరూ రూ.18 కోట్ల ఆటగాళ్లు కావడంతో ఒప్పందం పూర్తి కావడం సహజమే. కానీ రాజస్థాన్ రాయల్స్ నేరుగా మార్పిడికి అంగీకరించడం లేదు" అని రిపోర్ట్ పేర్కొంది.
రాయల్స్ మరో ఆటగాడిని కూడా డీల్లో చేర్చాలని కోరుతున్నారని సమాచారం. ఆయనే దక్షిణాఫ్రికా యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ డేవాల్డ్ బ్రెవిస్.
36
చెన్నైకి భవిష్యత్తు పెట్టుబడిగా డేవాల్డ్ బ్రెవిస్
డేవాల్డ్ బ్రెవిస్ 2025 సీజన్ మధ్యలో చెన్నై జట్టులోకి పేసర్ గుర్జప్నీత్ సింగ్ స్థానంలో చేరారు. తక్కువ మ్యాచ్లు ఆడినప్పటికీ, తన అద్భుతమైన షాట్లతో “బేబీ ఏబీ” గా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ లీగ్ల్లో అద్భుత ప్రదర్శనలతో బ్రెవిస్ మరింత గుర్తింపు సాధించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ అతన్ని భవిష్యత్తు పెట్టుబడిగా చూస్తోంది. 2025లో జట్టు తొలిసారిగా లీగ్ టేబుల్లో చివరి స్థానంలో నిలవడంతో, బ్రెవిస్ వంటి యువ ఆటగాళ్లు జట్టు పునర్నిర్మాణంలో కీలకమని భావిస్తోంది. అందువల్ల ఆయనను ఈ ట్రేడ్లో చేర్చడానికి చెన్నై సిద్ధంగా లేదని రిపోర్టులు చెబుతున్నాయి.
ఈ చర్చలన్నింటిని రాజస్థాన్ రాయల్స్ యజమాని మణోజ్ బడాలే నడిపిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తమ వైఖరిలో దృఢంగా ఉంది.. జడేజా ట్రేడ్పై చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, అదనపు ఆటగాళ్లను ఇవ్వాలన్న ఉద్దేశం లేదని చెబుతున్నారు.
జడేజా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరని చెన్నై భావిస్తోంది. ఆయనను ఇవ్వడమే పెద్ద త్యాగమని జట్టు మేనేజ్మెంట్ అంతర్గతంగా అంగీకరించింది. ఈ ట్రేడ్ చర్చలు ప్రారంభించే ముందు చెన్నై జడేజాతో సలహా తీసుకున్నట్టు కూడా సమాచారం.
56
ఇతర జట్లు కూడా రాయల్స్ రాడార్లో ఉన్నాయి !
రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఇతర జట్లను కూడా సంప్రదించినట్లు ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్లతో కమ్యూనికేషన్ కొనసాగుతోందని సమాచారం.
సన్రైజర్స్ వైపు నుండి అయితే పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్థిరమైన ఓపెనర్లు ఉన్నందున సంజూ శాంసన్ కోసం ట్రేడ్ చేయాలన్న ఉద్దేశం వారిలో లేదని సమాచారం. అలాగే హైన్రిచ్ క్లాసెన్ను విడిచిపెట్టాలన్న ప్రణాళిక ఎస్ఆర్హెచ్ వద్ద లేదని కూడా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
66
ఒప్పందం జరిగితే ఐపీఎల్ లో సంచలనమే
సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, బ్రెవిస్ ట్రేడ్ జరిగితే, అది ఐపీఎల్ పవర్ బ్యాలెన్స్ను పూర్తిగా మార్చే ఒప్పందంగా నిలుస్తుంది. రెండు ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీల మధ్య ఈ మార్పిడి జరిగితే, లీగ్లో కొత్త వ్యూహాలు, నూతన సమీకరణాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం బాల్ రాజస్థాన్ రాయల్స్ కోర్టులోనే ఉందని ఈ నివేదిక పేర్కొంది. జడేజా వరకు మాత్రమే చర్చలు సాధ్యమని చెన్నై తమ ప్రతిపాదనను స్పష్టంగా తెలిపిందని సమాచారం. రాబోయే రోజుల్లో ఈ చర్చలు ఐపీఎల్ ను కుదిపేసే అవకాశముంది. అభిమానుల చూపంతా ఇప్పుడు చెన్నై, రాజస్థాన్ మేనేజ్మెంట్ల చర్చలపైనే ఉంది.