ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డే ద్వారా తిరిగి ఫామ్లోకి వచ్చిన టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇప్పుడు సఫారీలతో జరుగుతోన్న తొలి టెస్టులో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతూ ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. రోహిత్ శర్మ 57 పరుగులకు అవుట్ కాగా.. విరాట్ కోహ్లీ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు.