పోలీసుల వివరాల ప్రకారం.. పుదుచ్చేరి అండర్-19 జట్టు ప్రధాన కోచ్గా ఎస్. వెంకటరమణ వ్యవహరిస్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో క్యాప్ (CAP) కాంప్లెక్స్లోని ఇండోర్ నెట్స్లో కోచ్ వెంకటరమణ ఉండగా, ముగ్గురు క్రికెటర్లు అక్కడికి వచ్చారు. సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ టీ20 టోర్నీకి తమను ఎంపిక చేయకపోవడంపై వారు కోచ్తో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన ఆటగాళ్లు కోచ్పై దాడి చేశారు. ఈ దాడిలో కోచ్ వెంకటరమణ తల, నుదురు, భుజం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని సీనియర్ క్రికెటర్ కార్తికేయన్ జయసుందరమ్, ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఎ.అరవిందరాజ్, ఎస్.సంతోష్ కుమారన్గా గుర్తించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు సెదార్పేట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నట్టు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్. రాజేష్ తెలిపారు.