శనివారం 12.30 AM భారత అభిమానుల నిరీక్షణ ముగిసింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ నేతృత్వంలో బోట్పై ప్రయాణిస్తున్న భారత క్రీడాకారులు ప్రేక్షకుల అభినందనలు స్వీకరిస్తూ ఈ ఫ్లోటింగ్ పరేడ్లో పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. అయితే, వర్షం మధ్య ప్రారంభోత్సవం కొనసాగింది. నీటిపై సాగిన ఈ పరేడ్లో ఈజిప్టు ఆటగాళ్ల తర్వాత కొద్ది సేపటికే భారత జట్టు కూడా పరేడ్ లో పాల్గొంది.