ఒకానొక సమయంలో సమయంలో అర్షద్ నదీమ్ వద్ద తన కోసం జావెలిన్ కొనడానికి కూడా డబ్బు లేదు. అర్షద్ నదీమ్ తండ్రి మహ్మద్ అష్రఫ్ మాట్లాడుతూ.. 'అర్షద్ ఈ స్థితికి ఎలా చేరుకున్నాడో ప్రజలకు తెలియదు. అతని స్నేహితులు, గ్రామస్థులు, బంధువులు అతని కోసం నిధులు సేకరించేవారు, తద్వారా అతను ఇతర నగరాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటూ పోటీలో పాల్గొన్నాడు' అని తెలిపారు. పాకిస్థాన్ మొత్తం ఏడుగురు ఆటగాళ్లను పారిస్కు పంపగా వారిలో ఆరుగురు తమ తమ ఈవెంట్ల ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. అర్షద్ నదీమ్ ఫైనల్స్కు అర్హత సాధించడంతో పాటు గోల్డ్ మెడల్ గెలవడంతో అతనితో ప్రయాణించిన కుటుంబం, గ్రామం, దేశం ఇప్పుడు సంబరాలు చేసుకుంటోంది.