క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో లక్ష్యసేన్ 19-21, 21-15, 21-12తో చైనీస్ తైపీకి చెందిన చౌ టియన్ చెన్ను ఓడించి సెమీ-ఫైనల్ కు చేరుకున్నాడు. భారత్ తరఫున సైనా నెహ్వాల్ ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్లో కాంస్య పతకం (2012), పీవీ సింధు రజత పతకం (2016), కాంస్య పతకం (2020) గెలుచుకున్నారు. ఇప్పుడు బ్యాడ్మింటన్ లో భారత్ కు మెడల్ అందించడానికి లక్ష్య సేన్ ముందుకు సాగుతున్నాడు.