2022 నుండి 2024 మధ్య కాలంలో టీమిండియాలో రెగ్యులర్ ఫినిషర్గా ఉన్న రింకూ సింగ్, ఇటీవల కాలంలో మల్టీ స్కిల్డ్ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అవకాశాలు కోల్పోయాడు. అయితే, వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీలో ఒక స్పెషలిస్ట్ ఫినిషర్ అవసరాన్ని గుర్తించిన సెలెక్టర్లు, రింకూ సింగ్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. సౌతాఫ్రికా సిరీస్ సమయంలోనే జట్టుకు ఫినిషర్ కొరత కనిపించడంతో రింకూ ఎంపిక ఖరారైంది.
టీ20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. ఫిబ్రవరి 7న టోర్నీ ప్రారంభం కానుండగా, మార్చి 20న ఫైనల్ జరగనుంది. భారత్ గ్రూప్ ఏ లో ఉంది. ఈ గ్రూప్లో పాకిస్థాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు కూడా ఉన్నాయి.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.