IPL 2026: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్ జట్టుకు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఓపెనర్లు బలంగా మారగా..
ఐపీఎల్ 2026 సీజన్లో ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ విజయం సాధించి అజేయంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నేడు గువహటిలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది.
25
జట్ల బలాబలాలు
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వారి ఓపెనర్లు యశస్వి జైస్వాల్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రధాన బలం. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా వేగంగా పరుగులు సాధించడంలో వీరు దిట్ట. మరోవైపు ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, దేవ్ దత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా పడిక్కల్ వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించి జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు.
35
పిచ్, గ్రౌండ్ గణాంకాలు:
బర్సపరా క్రికెట్ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అయితే, గడిచిన మ్యాచ్ల సరళిని బట్టి చూస్తే ఇక్కడ స్పిన్నర్లకు కూడా మంచి సహకారం లభిస్తోంది. ఈ గ్రౌండ్లో జరిగిన 8 మ్యాచ్ల్లో 4 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, 3 సార్లు ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించాయి. సగటు స్కోరు 144 పరుగులుగా ఉన్నప్పటికీ, ఈ ఇన్-ఫామ్ జట్లు 200 పైగా పరుగులు చేసే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికరమైన పోరాటాలు చోటుచేసుకోనున్నాయి. విరాట్ కోహ్లీ, సందీప్ శర్మల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది, సందీప్ కోహ్లీని ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 7 సార్లు అవుట్ చేశాడు.
55
కృనాల్ పాండ్యా పాత్ర కీలకం
అలాగే రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను కట్టడి చేయడంలో ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా పాత్ర కీలకం కానుంది. రెండు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, బౌలింగ్ విభాగం బలంగా ఉండటంతో రాజస్థాన్ రాయల్స్కు విజయావకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి.