భారత జట్టు ఛాంపియన్ గా నిలిచిన తర్వాత భారీ ప్రైజ్ మనీ అందుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈసారి రికార్డు స్థాయి బహుమతి మొత్తం ప్రకటించింది. మొత్తం USD 13.88 మిలియన్ (సుమారు రూ.122.5 కోట్లు) ప్రైజ్ పూల్గా నిర్ణయించారు. ఇది గత ఎడిషన్ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
• విజేతలకు (భారత జట్టు): USD 4.48 మిలియన్ (రూ.39.55 కోట్లు)
• రన్నరప్ (దక్షిణాఫ్రికా): USD 2.24 మిలియన్ (రూ.19.77 కోట్లు)
• సెమీఫైనల్లో ఓడిన జట్లకు: ఒక్కో జట్టుకు USD 1.12 మిలియన్ (రూ.9.89 కోట్లు)
• గ్రూప్ స్టేజ్ గెలుపు బోనస్: ఒక్క విజయానికి USD 34,314 (రూ.30.29 లక్షలు)
• పాల్గొన్నందుకు ఫీజు: ఒక్కో జట్టుకు USD 250,000 (రూ.2.20 కోట్లు)
బహుమతి మొత్తంలో 239% పెరుగుదల చోటుచేసుకుంది. ఈ పెరుగుదల మహిళల క్రికెట్ అభివృద్ధిపై ఐసీసీ దృష్టిని ప్రతిబింబిస్తుంది.