భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా సెమీఫైనల్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. యువ సంచలనం అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా రానుండగా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్ను నడిపించనున్నారు. కివీస్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. మెక్కోన్చీ స్థానంలో జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు. ఆశ్చర్యకరంగా కివీస్ అదనపు ఆఫ్ స్పిన్నర్ను తీసుకోలేదు, ఇది అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లకు కలిసొచ్చే అంశం.
భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.