టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 20న ఫైనల్తో ముగుస్తుంది. భారత్ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపికైన 15 మంది సభ్యుల భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, రింకూ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).