రింకూ సింగ్ చేరిక.. ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కేనా?
వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమైన రింకూ సింగ్ తిరిగి జట్టుతో చేరాడు. అయితే, అతడిని నేరుగా తుది జట్టులోకి తీసుకోవడం అనుమానంగానే ఉంది. రింకూను తీసుకుంటే ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఆరో బౌలర్ సమస్య ఉన్నందున, టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని భావిస్తోంది. అర్ష్దీప్ సింగ్ కొత్త బంతితో వికెట్లు తీయడం భారత్కు కీలకం కానుంది.
భారత తుది జట్టు అంచనా
సంజూ శాంసన్ (కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.