వీళ్లే మొనగాళ్లు..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు మార్చి 9న (రేపు) దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్తో తలపడుతుంది. భారత జట్టు విషయానికొస్తే, ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా ఫైనల్కు వచ్చింది.
భారత జట్టులో విరాట్ కోహ్లీ నుంచి మహ్మద్ షమీ వరకు ప్రతి ఆటగాడు జట్టు విజయంలో భాగస్వామ్యం అయ్యాడు. న్యూజిలాండ్తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్లో కొంతమంది ఆటగాళ్లు ఆట గమనాన్ని మార్చే సత్తాతో మెరిసే అవకాశం ఉంది.