549 టార్గెట్.. కానీ.!
సొంతగడ్డపై ప్రస్తుతం టీం ఇండియా ప్రదర్శన దిగజారుతోంది. ఇదే క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు స్వదేశంలో బలమైన జట్టుగా పేరుగాంచిన భారత్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో పూర్తిగా పట్టు కోల్పోయింది. కోల్ కతా టెస్టులో కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన భారత జట్టు, గౌహతి టెస్టులో మరింత పేలవమైన ఆటను ప్రదర్శించింది. గౌహతిలో, తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికాకు 489 పరుగుల భారీ స్కోరును భారత్ అందించింది. దీనికి బదులుగా, బ్యాటింగ్ లో 201 పరుగులకే ఆలౌట్ అయి, సౌత్ ఆఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అలా మొత్తం 549 పరుగుల టార్గెట్ను భారత్ ముందు ఉంచింది.