షమీకి కూడా షాక్..
హార్దిక్ పాండ్యాతో పాటు, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కూడా ఈ సిరీస్కు ఎంపిక కాలేదు. గాయం నుండి కోలుకుంటున్న షమీ జట్టులోకి వస్తారని ఊహాగానాలు వచ్చినప్పటికీ, సెలెక్టర్లు అతని విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే టెస్ట్ మ్యాచ్లు, ప్రపంచ కప్ కోసం అతన్ని పూర్తిగా సిద్ధం చేయాలనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది.
మరోవైపు, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టులో ఉన్నప్పటికీ, అతని లభ్యత ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుంది. బీసీసీఐ COE నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే అతను బరిలోకి దిగుతాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
న్యూజిలాండ్ సిరీస్కు ఎంపికైన భారత జట్టు ఇదే
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్.