దబాంగ్.. దబాంగ్.. దొబ్బేయ్.. దొబ్బేయ్.. PCBకి ఇచ్చిపడేసిన ఐసీసీ, బీసీసీఐ..

Published : Feb 10, 2026, 08:04 PM IST

Pakistan Cricket: భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించింది. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో పీసీబీ షరతులను భారత బోర్డు ఒప్పుకోలేదు.

PREV
15
దబాంగ్.. దబాంగ్..

భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం ప్రకటించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన అన్ని డిమాండ్లను బీసీసీఐ స్పష్టంగా తిరస్కరించింది.

25
పీసీబీ పలు షరతులు

టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌ల నేపథ్యంలో పీసీబీ పలు షరతులు విధించగా, వాటికి బీసీసీఐ అంగీకరించలేదు. తమ వైఖరిని ఐసీసీకి కూడా చెప్పింది. తాజా సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ఆలోచనలో భారత్ లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. గత సంవత్సరాలుగా ఉన్న రాజకీయ, భద్రతా పరిస్థితుల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ నిలిచిపోయింది.

35
ఎలాంటి మార్పు ఉండదని

ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని భారత బోర్డు తేల్చి చెప్పింది. ఆసియా కప్ లేదా వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్ల కోసం భారత్ పాకిస్తాన్‌కు వెళ్ళబోదని కూడా బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్తులో జరిగే ఏ అంతర్జాతీయ టోర్నమెంట్ అయినా భారత్ పాల్గొంటే, అది తటస్థ మైదానంలోనే జరుగుతుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

45
ప్రధానంగా మూడు డిమాండ్లు

పీసీబీ ప్రధానంగా మూడు డిమాండ్లు పెట్టింది: ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ, మ్యాచ్ ముందు, తర్వాత ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్‌లు, ఎక్కువ వాటా శాతం. ఈ డిమాండ్లకు బీసీసీఐ నో చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ తన భద్రత, విధానాల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని ఈ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

55
భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను

అటు భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో, తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని స్పష్టమైంది.

Read more Photos on
click me!

Recommended Stories