Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?

Published : Feb 10, 2026, 10:16 PM IST

Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ దూరమయ్యే అవకాశం ఉంది. అతని స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. అభిషేక్ శర్మకు ఏమైంది?

PREV
15
ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? ఢిల్లీ నెట్స్ ప్రాక్టీస్‌లో కనిపించని అభిషేక్ శర్మ

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తన రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 12, గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో టీమిండియా తలపడనుంది. 

అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం కారణంగా అతను మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరు కాలేదు.

25
అభిషేక్ శర్మ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్

అభిషేక్ శర్మ ప్రస్తుతం తీవ్రమైన జ్వరం, కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అతను అనారోగ్యంతోనే బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్, రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. 

అతని స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ బాధ్యతలు చేపట్టాడు. తాజాగా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ మాట్లాడుతూ.. అభిషేక్ ఇంకా కోలుకోలేదని, నమీబియాతో మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.

35
ఢిల్లీలో ప్రాక్టీస్ సెషన్‌కు అభిషేక్ శర్మ దూరం

మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్‌లో పాల్గొన్నప్పటికీ, అభిషేక్ శర్మ మాత్రం కనిపించలేదు. ముంబై నుంచి జట్టుతో కలిసి అతను ఢిల్లీకి ప్రయాణించలేదని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. 

ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని, టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతినిచ్చి, పూర్తి ఫిట్‌నెస్ సాధించేలా చూడాలని భావిస్తోంది.

45
రిప్లేస్‌మెంట్‌గా సంజూ శాంసన్?

అభిషేక్ శర్మ అందుబాటులో లేకపోతే, అతని స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ జోడీగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్ వంటి బౌలర్లను ఎదుర్కొంటూ శాంసన్ చాలా సమయం ప్రాక్టీస్ చేశాడు. శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూల అంశం.

55
బుమ్రా రాక.. వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్

భారత జట్టుకు మరోవైపు ఊరటనిచ్చే వార్త కూడా అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అతను వేగవంతమైన బంతులతో ఇబ్బంది పెట్టాడు. 

అమెరికాతో మ్యాచ్‌కు దూరమైన బుమ్రా, నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అలాగే, గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా జట్టుతో చేరాడు. అతను కూడా ప్రాక్టీస్‌లో పాల్గొని తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories