అలాగే దైవ కార్యాలు చేపట్టే సమయంలో నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి. ఇంటి ముందు దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని అస్సలు తొక్కరాదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం (Widowhood) రాదని సుమంగళిగా (Sumangali) మరణిస్తున్నారని దేవీ పురాణం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి.