ఈ రోజు విష్ణుమూర్తికి పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవారు తామసిక ఆహారాన్ని తినకూడదు. అంటే ఉల్లి, వెల్లుల్లి, మాంసం వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిని తింటే మీకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. పవిత్రమైన ఏకాదశి నాడు మీరు ఎవరి గురించీ కూడా చెడ్డగా, తప్పుగా మాట్లాడొద్దు.