సనాతన ధర్మంలో పూర్ణిమ, అమావాస్య తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పూజలు చేయడం, ధ్యానం, దానం చేయాలనే నియమం కూడా ఉంది. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా గంగా స్నానం చేస్తారు. అమావాస్య, పౌర్ణమినాడు గంగానదిలో స్నానం చేస్తే మనం తెలియకుండా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో ఉంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది గంగా లేదా ఇతర పవిత్రనదుల స్నానమాచరిస్తారు. ఆ తర్వాత విష్ణువును నియమాలప ప్రకారం పూజ చేస్తారు. అమావాస్య నాడు దేవుడి పూజ చేయడం, దానాలు చేయడం వల్ల అమోఘమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు వీటివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. మరి ఈ ఏడాది మార్గశిర్ష అమావాస్య ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం..