విష్ణువును ఎలా పూజించాలి?
ఈ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఉపవాసం పాటించాలి. పూజ చేసేటప్పుడు శ్రీమహావిష్ణువుకు పసుపురంగులో ఉండే స్వీట్లను సమర్పించాలి. ఎందుకంటే పసుపు రంగు శ్రీ హరికి ఇష్టమైనదిగా భావిస్తారు. విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించండి. ఈ రోజు రావిచెట్టుకు నీటిని సమర్పించండి. ఇది ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది.