వినాయక చవితి అనేది హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన పండగ. గణేశుడు పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకోవడం ద్వారా కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతుందని భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ పండగను కృత యుగం నుంచి భక్తులు చేస్తున్నారు. వినాయక చవితి పండుగను కృతయుగంలో మొదటగా దేవతలు నిర్వహించారట. ముఖ్యంగా ఈ పండుగను స్వయంభువ మనువు గణేశుడి పూజను నిర్వహించడమే వినాయక చవితి పండగకు మొదలు అని కొంతమంది పండితులు తెలిపారు. అప్పటి నుండి ఈ పండుగను ప్రతి యుగంలో, ప్రతి సంవత్సరం భక్తుడు విశ్వాసంతో నిర్వహిస్తున్నారని ప్రతీతి. కృతయుగం నుండి మొదలై, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోనూ విఘ్నేశ్వరుడికి నిరాటంకగా పూజలు కొనసాగుతున్నాయి. అందువల్ల ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలంటే భక్తులు నమ్మకంగా వినాయక చవితి పండగను చేయాలి.