భోగి పండ్లను 12 ఏళ్లలోపు పిల్లలకు పోస్తారు. భోగిపండ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు (Coins), చెరుకు గడ ముక్కలు (Pieces of sugar cane) కలిపి పిల్లల తలపై పోస్తారు. ఇలా పిల్లలకి తలమీద నుంచి భోగిపండ్లు పోసి వారికి దిష్టి తీస్తారు. ఇలా పోసిన తర్వాత కింద పడ్డ భోగి పండ్లను ఎవరు తినకూడదు. దిష్టి తీసిన భోగి పండ్లను ఎవరూ తొక్కని ప్రదేశములో పడివేస్తారు.