హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1.పూలు 2.అక్షింతలు, 3.ఫలాలు,4,అద్దం, 5.వస్త్రం, 6.తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా భావిస్తారు.కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసే సమయంలో తమలపాకుని ఉపయోగిస్తారు.పూజలలో, వ్రతాలలో, నోములలో తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు.పసుపు గణపతినీ,గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.భారత దేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు.