ఉపవాసం-జాగారం దీక్ష: భోళాశంకరుడికి ఎంతో పీతిపాత్రమైన ఈ మహాశివరాత్రి రోజున శివలింగానికి స్వచ్చమైన నీరు, పాలు, బిల్వపత్రాలతో శివనామస్మరణతో అభిషేకం చేయాలి. ఈ మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారం తీసుకుంటూ,దీక్షను చేస్తూ పండ్లు తీసుకుంటూ.. ఆ భోళాశంకరుడిని పూజిస్తారు. మహా శివరాత్రి పర్వదినం రోజున నిష్టగా ఉపవాసం, జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడి ఆశిస్సులు ఎల్లప్పుడూ భక్తులపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.