భోగి పండ్లను 12 ఏళ్లలోపు పిల్లలకు పోస్తారు. భోగిపండ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు , చెరుకు గడ ముక్కలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ఇలా పిల్లలకి తలమీద నుంచి భోగిపండ్లు పోసి వారికి దిష్టి తీస్తారు. ఇలా పోసిన తర్వాత కింద పడ్డ భోగి పండ్లను ఎవరు తినకూడదు. దిష్టి తీసిన భోగి పండ్లను ఎవరూ తొక్కని ప్రదేశములో పడివేస్తారు.
ఈ భోగి రోజు భోగి మంటల ద్వారా మనలో ఉన్న చెడును, బద్దకాన్ని భోగిమంటల్లో వేసి.. ఇవాళ్టి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని కోరుకుంటారు. అదే.. ఈ భోగి పండుగ విశిష్టత. దాంతో పాటు.. భోగి రోజున ఇంట్లోని పిల్లల తల మీద రేగు పండ్లు పోసి వాళ్లలోని చెడును తొలగిస్తారు.శాస్త్రీయ కారణం మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార, సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం సరికాదు. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.