Sankat Hara Chaturthi: ఈ ఒక్క రోజు గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి

Published : Apr 15, 2025, 12:59 PM IST

Sankat Hara Chaturthi: ఏ పని మొదలు పెట్టాలన్నా మొదట గణపతిని పూజించాలని అంటారు. అయితే సంకట హర చతుర్థి రోజు పూజిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ రోజు గణపతిని ఏవిధంగా పూజించాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
Sankat Hara Chaturthi: ఈ ఒక్క రోజు గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి

‘ఆది పూజ్యో గణాధిప:’ అంటే మీ ఇష్టదైవం ఎవరైనప్పటికీ మొదటిగా గణపతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. విఘాలు, గండాలు, కష్టాలను తొలగించే దేవుడు కాబట్టే గణపతిని విఘ్నేశ్వరుడని పిలుస్తారు. ఈ స్వామి వారి అనుగ్రహం పొంది ఏ పని ప్రారంభించినా అడ్డంకులు లేకుండా జరుగుతాయని భక్తులు నమ్ముతారు. అయితే సంకట హర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు. సంకట హర చతుర్థి రోజు పూజ ఎలా చేయాలి? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. తదితర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

25

సంకట హర చతుర్థి రోజున ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ప్రత్యేకమైన పూజా విధానం, నియమాలు ఉన్నాయి. మిగతా రోజుల్లో స్వామి వారిని పూజించడం వేరు. సంకట హర చతుర్థి రోజు పూజించడం వేరు. ఈ ఒక్క రోజు గణపతి దేవుడిని శ్రద్ధగా పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. 

సంకట హర చతుర్థి రోజు చేయవలసినవి

ఉదయం నుండి సాయంత్రం చంద్రోదయం అయ్యే వరకు ఉపవాసం ఉండాలి. తక్కువగా పళ్ళు, పాలు తీసుకోవచ్చు.

35

ముందుగా ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు లేదా శుభ్రమైన, ఉతికిన బట్టలు కట్టుకుని గణపతి ప్రతిమకు పంచామృతంతో అభిషేకం చేయండి. 

ముందుగా దీపారాధన చేసి, సంకల్పం చెప్పుకొని, మీ మనసులోని కోరికను స్వామి వారికి చెప్పుకోవాలి. తర్వాత దర్భ గడ్డి లేదా తమలపాకుతో ప్రాణ ప్రతిష్ఠాపన మంత్రం చెబుతూ గణపతిని ఆ విగ్రహం లోకి ఆహ్వానించాలి. తర్వాత షోడశ ఉపచారాలు అంటే 16 విధాలుగా సేవ చేయాలి. 

45

తర్వాత పంచ ద్రవ్య అభిషేకం చేయాలి.  పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తీసుకొని గణపతిని ధ్యానిస్తూ లేదా గణపతి మూల మత్రం చదువుతూ అభిషేకం చేయాలి. లేదా సమీపంలోని ఆలయానికి ఈ అభిషేక ద్రవ్యాన్ని తీసుకెళ్లి అభిషేకం చేయించుకోవాలి.

తర్వాత శుభ్రంగా కడిగిన తర్వార వినాయకుడికి ఇష్టమైన దర్భ గడ్డి, తెల్ల జిల్లేడు, మందార పుష్పం, దూర్వాలతో పూజించాలి. ఆ సమయంలో గణపతి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. 
దర్భతో వినాయకుని స్థాపన: భక్తితో వినాయకుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని స్థాపించి పూజ చేయాలి.

తర్వాత మోదకాలు గాని, కుడుములు, ఉండ్రాళ్లు లాంటి గణపతి ఇష్టమైన ఆహారాన్ని వండి నైవేద్యంగా పెట్టాలి.

55

చివరిగా వినాయక చతుర్థి వ్రత కథ విని అక్షింతలు శిరస్సున చల్లుకోవాలి. వ్రత కథను వినడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వేదపండితులు చెబుతున్నారు. 
చంద్రోదయం తర్వాత చంద్రుని దర్శిస్తూ 108 సార్లు "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని జపించాలి.

పేదలకు అన్నదానం

పూజ అనంతరం పేదలకు అన్నదానం చేయడం చాలా ముఖ్యం. మీ శక్తి మేరకు శరీరం సహకరించిలేని వారికి అన్నదానం చేయడం ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. సంకట హర చతుర్థి రోజు ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతూ, శుభ్రత, ఐశ్వర్యం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి కాశీలో అలాంటి వ్యక్తుల శవాలను దహనం చేయరు? ఎందుకంటే..?

Read more Photos on
click me!

Recommended Stories