రథ సప్తమి రోజు ఇవి చేస్తే... ఆ సమస్యలన్నీ తిరినట్లే..!
ముఖ్యంగా ఎర్రచందనంతో కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయట. మరి, అవేంటో చూసేద్దామా...
ముఖ్యంగా ఎర్రచందనంతో కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయట. మరి, అవేంటో చూసేద్దామా...
ప్రతి సంవత్సరం రథ సప్తమిని మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది రథ సప్తమి ఫిబ్రవరి 4వ తేదీన వచ్చింది. ఈ రథ సప్తమి రొజున అందరూ సూర్య భగవానుడిని పూజిస్తారు. సరిగ్గా పూజించడం వల్ల జీవితంలో చాలా రకాల సమస్యలను , అడ్డంకులను ఎదుర్కొనవచ్చట. ముఖ్యంగా ఎర్రచందనంతో కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయట. మరి, అవేంటో చూసేద్దామా...
రథ సప్తమి రోజున ఉదయాన్నే తలస్నానం ఆచరించి... సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. అలా సమర్పించే నీటిలో ఎర్ర చందనం కలపాలి. అలా ఎర్ర చందనం కలిపిన నీటిని సూర్యునికి సమర్పించడం వల్ల జాతంలో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. జాతకంలో సూర్యుడి స్థానం బలోపేతం చేస్తుంది. అదృష్టం కలుగుతుంది.
రథ సప్తమి రోజున, ఎర్ర గంధపు పొడిని తయారు చేసి ఎర్రటి వస్త్రంలో కట్టండి. ఎక్కువ పొడిని తయారు చేయవద్దు, చిటికెడు అయినా చాలు. ఎందుకంటే విశ్వాసం గొప్పగా ఉండాలి. అప్పుడు ఆ ఎర్రటి వస్త్రాన్ని అశోక చెట్టుపై వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల శుభం జరుగుతుంది. రథ సప్తమి రోజున, నుదిటిపై, నాభిపై , గొంతుపై ఎర్ర చందన తిలకం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల శారీరక లోపాలు నయమవుతాయి. దీనితో పాటు, మీరు శని దోషం నుండి కూడా ఉపశమనం పొందుతారు. సూర్య భగవానుడి ప్రభావం వల్ల, శని దేవుడి కోపం చల్లబడి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి.
రథ సప్తమి రోజున, రాగి లేదా వెండి పెట్టెలో కొంత ఎర్ర చందనాన్ని వేసి, ఆ పెట్టెను ఇంట్లో పూజగదిలో ఉంచండి. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సానుకూలతను పెంచుతుంది. దానిని సేఫ్లో ఉంచడం ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. దీనితో పాటు, మీరు ఈ ఎర్ర చందన పెట్టెను మీ కెరీర్కు సంబంధించిన స్టడీ రూమ్, ఆఫీస్ డెస్క్ లేదా వ్యాపార స్థలం వంటి ప్రదేశంలో ఉంచితే, అది మీ కెరీర్లో విజయం అందుకుంటారు.