చాలా మంది రెగ్యులర్ గా పూజలు చేస్తుంటారు. పూజ చేస్తేనే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుందని నమ్ముతారు. అయితే పూజ చేసే సమయంలో దీపాన్ని ఖచ్చితంగా వెలిగిస్తారు. దూపదీపాలు దేవుడికి తప్పనిసరిగా సమర్పిస్తారు. అయితే హిందూమతంలో భోగం, పువ్వులు, మంత్రాలు ఒక్కో దేవతకు ఒక్కోలా ఉంటాయి. ఈ సంగతి అందరికీ తెలుసు. అలాగే దేవుళ్లకు దీపం వెలిగించే నియమం కూడా వేరుగా ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. అవును ఒక్కో దేవుడికి ఒక్కోరకమైన దీపాన్ని వెలిగించాలి. అప్పుడే దేవుళ్ల అనుగ్రహం మనపై ఉంటుంది. మరి ఏ దేవుడికి ఏ దీపం వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..