నిందలు వేస్తే...
కొన్ని నెలల తర్వాత, పక్క రాజ్యం నుంచి కొందరు వ్యాపారులు ఆ రాజును కలవడానికి వస్తున్నారు. మార్గమధ్యంలో ఒక పండ్ల వ్యాపారి వారిని ఆపి, “మా రాజుగారి దగ్గర జాగ్రత్త… ఆయన పెట్టిన భోజనం తింటే చచ్చిపోతారు!” అని చెప్పాడు. అతనికి తెలిసినది కేవలం రూమర్ మాత్రమే. నిజానికి అతడు ఆ సంఘటన వెనుక కారణం ఏంటో తెలియదు. కానీ తన మాటతో ఆ రాజు గురించి చెడు భావన కలిగించాడు.
అది తెలుసుకున్న యమధర్మరాజు వెంటనే తీర్పు ఇచ్చాడు —
“ఆ పాపం ఇప్పుడు ఈ పండ్ల వ్యాపారికే చెందుతుంది.” ఎందుకంటే, మరణానికి కారణమైనది విషం కాదు, ఇప్పుడు వ్యాపించిన తప్పుడు నింద.
దానివల్ల నిర్దోషి రాజు పేరు చెడిపోయింది, ఇతరుల మనసుల్లో అనవసర భయం కలిగింది. అని ఆ వ్యక్తి మరణానికి పండ్ల వ్యాపారి కారణం అని తీర్పు ఇచ్చాడు.
ఈ కథ మన జీవితానికి ఒక అద్దం లాంటిది.