Navratri: శరన్నవరాత్రులు.. అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం, ప్రత్యేకత ఇదే

First Published Oct 4, 2021, 1:28 PM IST

Navratri: హిందువులు పవిత్రంగా పూజించే పండుగ విజయదశమి. విజయదశమి రోజున అమ్మవారిని పూజిస్తే సకల పాపపుణ్యాలు తొలగిపోతాయి. ఇక ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి నుంచి అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి.

Navratri: హిందువులు పవిత్రంగా పూజించే పండుగ విజయదశమి. విజయదశమి రోజున అమ్మవారిని పూజిస్తే సకల పాపపుణ్యాలు తొలగిపోతాయి. ఇక ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి నుంచి అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ రోజు నుంచి అమ్మవారిని తొమ్మిది అవతారాలతో పూజలు చేస్తారు. ఆ తొమ్మిది రోజులు అమ్మవారికి నిష్టగా పూజలు చేసి అమ్మవారి దయ అందుకుంటారు. ఇక దశమిరోజు విజయదశమి గా అమ్మవారిని పూజిస్తారు. ఇక ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా ఎంతో ముఖ్యమైనవి.  ఇక ఏ రోజు ఏ అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం.
 

మొదటి రోజు అమ్మవారు శైలి పుత్ర అవతారంలో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీశైలం సాంప్రదాయం ప్రకారం సాంబారు అన్నం, మినప వడలు, రవ్వ కేసరి, పానకం అమ్మవారికి సమర్పిస్తారు.

 రెండవ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తుంది. ఆరోజు అమ్మవారికి ఇష్టమైన పులిహోర నైవేద్యంగా పెట్టి ఆమె ఆశీర్వాదాలు పొందుతారు.

మూడవరోజు అమ్మవారు చంద్రఘంటా అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఆ రోజు అమ్మవారికి  కొబ్బరి అన్నం, పాయసం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలి.

నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారం లో దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృప లు అందుకోవాలి.

 అయిదవ రోజు అమ్మవారు లలితా దేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలి.
 

ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఏడవ రోజు అమ్మవారు జగన్మాత సరస్వతీ రూపంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం, అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారం లో దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు.

తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్ధిని అమ్మవారి గా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి రవ్వతో చేసిన చక్కెర పొంగలిను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఇక చివరి రోజైన విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి గా దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి సేమియా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం, పరమాన్నం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృప అందుకుంటారు.

click me!