ఆ తర్వాత విష్ణువును పూజించే సమయంలో ఆయనకు పూలు, ధూపం, దీపం, నైవేద్యం, కుంకుమ మొదలైనవి సమర్పించాలి. తర్వాత లక్ష్మీ, సరస్వతి సమేత విష్ణుమూర్తిని పూజించాలి. ఈ సమయంలో విష్ణువు మంత్రాలను పఠించాలి. పూజ చేసేటప్పుడు మత్స్యావతారం కథను ఖచ్చితంగా చదవండి. ఆ తర్వాత స్వీట్లను సమర్పించి.. చివరగా హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచండి.