అభిషేకం ఎలా చేయాలి?
మీరు మీ జీవితంలో దుఃఖం, బాధల నుంచి నుండి విముక్తి పొందాలనుకుంటే మకర సంక్రాంతి నాడు గంగా నీరు కలిపిన నీటితో స్నానం చేయండి. అందుబాటులో ఉంటే గంగా, గోదావరి, నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయండి. ఆ తర్వాత తెల్లని దుస్తులు ధరించి ఆవు పాలతో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యితో శివుడికి అభిషేకం చేయండి. ఈ సమయంలో నల్ల నువ్వులు, పువ్వులు, బెల్విపత్రం వంటి వస్తువులను శివుడికి సమర్పించండి. పూజ సమయంలో శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి.