ఈ శ్లోకం అర్థం ఏమిటంటే.... ‘మలిన వస్త్రమును ధరించిన వానిని, పళ్లు తోమని వానిని, తిండిపోతును, నిష్టురోక్తులాడు వానిని, ఉదయం, సాయంత్రం వేళ నిద్రించు వానిని ఇతర గుణణముల చేత విష్ణు సమానులైనను వీరిని లక్ష్మి పరిత్యంజిను’
మనలో చాలా మంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలని పూజలు చేస్తూ ఉంటాం. దానికంటే ముందు మనం మన బద్దకాన్ని వదిలించుకోవాలట. అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఉతుక్కోకుండా మురికి దుస్తులు వేసుకునే అలవాటు ఉన్నవారికీ, ఉదయాన్నే దంతాలు శుభ్రం చేసుకునే అలవాటు ఉన్నవారికీ, తిండి పోతులకీ, ఇతరులపై ఊరికే నిందలు వేసే వారికి, ఉదయం సంధ్యా సమయం వేళలో.. సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించే వేళల్లో నిద్రపోయే వారికి.. లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ లభించదట. వీరిపై లక్ష్మీ దేవి కోపంగా ఉంటుంది. అలాంటివారి ఇంట్లో లక్ష్మీ దేవి నిలపడదని గరుడ పురాణం చెబుతోంది. అందుకే.. ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు.